YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఒక్కో ప్రయాణికుడి నుంచి రెండు సీట్ల ఛార్జీలు

ఒక్కో ప్రయాణికుడి నుంచి రెండు సీట్ల ఛార్జీలు

ఒక్కో ప్రయాణికుడి నుంచి రెండు సీట్ల ఛార్జీలు
విజ‌య‌వాడ‌, 
భౌతిక దూరం నిబంధనతో అంతిమంగా ప్రయాణికుల జేబులకే చిల్లులు పడేలా కనిపిస్తోంది.అన్‌లాక్ 4.0 మార్గదర్శకాల్లో భాగంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కో రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తూ వస్తోంది. అయితే.. కొవిడ్-19 నిబంధనల మేరకు భౌతిక దూరం, శానిటైజేషన్ ప్రక్రియలను తప్పనిసరి చేశారు. భౌతిక దూరం నిబంధనను పాటించడానికి ఒక సీట్లో ఒక ప్రయాణికుడినే కూర్చునేలా అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 50 శాతం కెపాసిటీతోనే బస్సులు నడపాల్సి వస్తోంది. దీంతో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగానే చాలా రాష్ట్రాల్లో బస్సులను పూర్తి స్థాయిలో పున:ప్రారంభించడానికి ఆలోచిస్తున్నారు.అయితే.. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్లు మాత్రం ప్రయాణికుడి నుంచి రెండు సీట్ల ఛార్జీలను వసూలు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు ఒక్కో ప్రయాణికుడికి రెండు సీట్లు కేటాయించాల్సి వస్తోందని.. అందువల్ల ఆ రెండు సీట్ల ఛార్జీలను అతడి నుంచే వసూలు చేస్తున్నామని వారు చెబుతున్నారు.‘ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఒక ప్రయాణికుడి కోసం రెండు సీట్లు కేటాయించాల్సి వస్తోంది. అంటే.. 40 సీట్ల బస్సులో కేవలం 20 మందే ప్రయాణిస్తారు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో బస్సులో ఎక్కడానికి 20 మంది ప్రయాణికులు కూడా ఉండట్లేదు. దీంతో మాకు నష్టాలు వస్తున్నాయి. మాకు వేరే దారి లేదు’ అని రాజేశ్ సింగ్ అనే బస్సు యజమాని వాపోయాడు.ప్రయాణికులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావల్స్ ఏజెంట్లు మాత్రం తమ చర్యను సమర్థించుకుటున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. బస్సుల్లో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయడం వల్ల తమకు చాలా నష్టం వాటిల్లుతోందని.. అందువల్ల ప్రయాణికుల నుంచి రెండు సీట్ల ఛార్జీలు వసూలు చేస్తున్నామని వారు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌ డ్రైవర్లు ఇప్పటికే ప్రయాణికుల నుంచి అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో తమిళనాడు ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించింది. భౌతిక దూరం పాటించడానికి ఒక సీటులో ఒక ప్రయాణికుడే కూర్చునేలా చర్యలు చేపట్టింది. అయితే.. ఇందుకోసం ప్రయాణికుడి నుంచి ఒక సీటు ఛార్జీని మాత్రమే వసూలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లోనూ ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. మరి మిగతా రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో, ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Related Posts