న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4,
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఫాస్టాగ్స్ వినియోగాన్ని మరింత పెంచేలా మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారలపై టోల్ ప్లాజాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫాస్టాగ్స్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇప్పుడు వీటి వినియోగ స్థాయిని మరింత పెంచింది.పాత వాహనాలకు కూడా ఫాస్టాగ్స్ కచ్చితంగా ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ జారీ చేసింది. ప్రైవేట్, పర్సనల్ ఫోర్ వీలర్స్కు ఫాస్టాగ్ ఉండాలని తెలిపింది. 2021 జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుందని పేర్కొంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మరో రూల్ కూడా తెచ్చింది.ఓల్డ్ వెహికల్స్కు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని భావిస్తే.. కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాల్సిందేనని తెలిపింది. ఫాస్టాగ్ లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. మరో రూల్ కూడా ఉంది. ఫాస్టాగ్ లేకపోతే వెహికల్కు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడ కుదరదు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.రోడ్డ మంత్రిత్వ శాఖ ఈమేరకు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. టోల్ ప్లాజాల వద్ద క్యాష్ లేకుండా ఫాస్టాగ్స్ ద్వారా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2017 డిసెంబర్కు ముందు కొనుగోలు చేసిన వెహికల్స్కు కూడా ఫాస్టాగ్స్ తప్పనిసరి అని తెలియజేసింది. ఇకపోతే 2017 తర్వాత కొనుగోలు చేసిన వెహికల్స్కు ఫాస్టాగ్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం గతంలోనే తెలియజేసింది.