YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహిళపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు

మహిళపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు

వాయల్పాడు సెప్టెంబర్ 4
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం వాయుల్పడు మండలం చింతపర్తి కి చెందిన గొర్రెల కాపరి రవి అనుమానాస్పద మృతి కేసులో అనుమానితుడు ధనశేఖర్ రెడ్డి పై రవి భార్య వాయల్పాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు, ధన శేఖర్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని, 10 లక్షలు ఇప్పిస్తామని పోలీసులు బేరసారాలు ఆడారు. పోలీసులు మాటలకి మహిళ ప్రతిఘటించడంతో పోలీస్ స్టేషన్ లోనే మహిళపై అత్యంత దారుణంగా దాడి చేశారు. మహిళకు న్యాయం జరగాలంటూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాలతో రవి భార్య ఆందోళన చేపట్టారు.  రాజకీయ నాయకులతో కలిసి పోలీసులు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడడం పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ధన శేఖర్ పై, ఆయనకు వత్తాసు పలికిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts