YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కవల పిల్లలకు విషం...

కవల పిల్లలకు విషం...

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 4 
ఆడపిల్లలు పుట్టారనే అసహనంతో ఓ కర్కశ తండ్రి కనికరం లేకుండా వారిని నిర్దాక్షిణ్యంగా చంపేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం ఆ కవల శిశువులకు విషం తాగించాడు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యకు రెండో కాన్పులో కూడా ఆడపిల్లలే పుట్టారనే కారణంతో అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ శిశువుల ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉండగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గండ్వీడ్ మండలం దేశాయిపల్లికి చెందిన కేశవులు, కృష్ణవేణి దంపతులు. ఈ నెల 1న కోస్గి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కృష్ణవేణి రెండోసారి ప్రసవించింది. ఆమెకు ఇద్దరు ఆడ శిశువులు జన్మించారు. మొదటి కాన్పులో కూడా అమ్మాయే పుట్టడంతో కేశవులు అసంతృప్తి వ్యక్తం చేశాడు. మద్యం తాగిన కేశవులు ఎలాగైనా పిల్లలను చంపాలని నిర్ణయించుకున్నాడు. పిల్లలకు పురుగుల మందు తాగించాడు. పిల్లల నోట్లో నుంచి నురగ రావటంతో గమనించిన బంధువులు డాక్టర్‌ను సంప్రదించారు.పిల్లలపై విష ప్రయోగం జరిగిందని వైద్యుడు గుర్తించడంతో మెరుగైన వైద్యం కోసం శిశువులను మహబూబ్‌నగర్‌కు తరలించారు. ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించటంతో కన్న తండ్రి కేశవులే పిల్లలకు విషం తాగించటం.. డబ్బా పారవేయటం వంటి తతంగం బయటపడింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Related Posts