YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బొజ్జ‌లకు రాజ‌కీయ వార‌స‌త్వం బెంగ‌

బొజ్జ‌లకు రాజ‌కీయ వార‌స‌త్వం బెంగ‌

బొజ్జ‌లకు రాజ‌కీయ వార‌స‌త్వం బెంగ‌
తిరుప‌తి, 
ఫ్యామిలీ రాజకీయాలకు దూరం అయినట్లే. సుదీర్ఘకాలం జిల్లా రాజకీయాలను శాసించిన ఆయన ఇప్పుడు అనారోగ్యంతో పాలిటిక్స్ నుంచి దాదాపు తప్పుకున్నట్లే. ఆయనే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా మంత్రి అయినట్లే. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అప్రతిహత విజయాలను సాధించారు.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఐదు సార్లు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1989 నుంచి ఆయన 1994, 1999 ఎన్నికల్లో వరసగా గెలిచి హ్యాట్రిక్ విజయాలను సాధించారు. 2004లో ఓటమి చెందారు. 2009, 2014 ఎన్నికల్లో తిరిగి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఒకరకంగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకూ శ్రీకాళహస్తి అంటే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గుర్తుకు వస్తారు. అంతగా శ్రీకాళహస్తిని ఆయన తన కంచుకోటగా మలచుకున్నారు.2014 ఎన్నికల్లో గెలిచిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని తొలి విడతలోనే చంద్రబాబు తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. మంత్రి వర్గ విస్తరణలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మంత్రి పదవి నుంచి చంద్రబాబు తొలగించారు. దీంతో ఆయన చంద్రబాబు వైఖరిపై మండి పడ్డారు. తన ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇక ఎమ్మెల్యే పదవి ఎందుకని? దానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీ సీనియర్ నేతల బుజ్జగించడంతో మళ్లీ కూలయ్యారు.2019 ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన తనరాజకీయ వారసుడిగా కుమారుడు సుధీర్ రెడ్డిని బరిలోెకి దించారు. అయితే సుధీర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తండ్రి బాటలో నడవాల్సిన సుధీర్ రెడ్డి ఓటమితో కుంగిపోయి నియోజకవర్గంలో క్యాడర్ ను పట్టించుకోవడం లేదు. పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కరోనా సమయంలోనూ ఆయన కన్పించలేదు. దీంతో బొజ్జల ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న శ్రీకాళహస్తిలో పట్టుకోల్పోయినట్లే కన్పిస్తుంది.

Related Posts