ఓటుబ్యాంకు రాజకీయాల కోసం అమరవీరుల చరిత్రను మరుస్తున్న ప్రభుత్వం
హైదరాబాద్
ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఉద్దేశపూర్వకంగా మరగునపరుస్తున్న తెలంగాణ అమరవీరుల చరిత్రను ఈ తరానికి తెలియజెప్పేందుకు రెండు రోజుల యాత్రలో రజాకార్ల అరాచకాలు, అకృత్యాలకు గురైన స్థలాలను నేడు (సెప్టెంబర్ 8) సందర్శించడానికి బయలుదేరే ముందు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో బిజెపి శాసన మండలి పక్ష నాయకులు ఎన్ రాంచందర్ రావు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ రావు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి దుగ్యాల ప్రదీప్ కుమార్ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక, రేణికుంట సందర్శించడానికి బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి యాత్ర ప్రారంభం అయ్యింది.