మెదక్ సెప్టెంబర్ 10,
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట గ్రామంలో దళిత వాడ అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన చెందుతున్న గ్రామాల దళితులు వారి ఇ మనోవేదన వారి మాటల్లో వింటుంటే ఏ లాంటి వారి కై నా గుండె జల ధరించక మానదు. వివరాల్లోకి వెళితే గ్రామంలో దళితవాడ అధ్వాన్నంగా ఉన్నదని ప్రస్తుత గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి దగ్గరకు వెళ్లి ఎన్నిసార్లు బ్రతిమిలాడిన చేస్తానంటున్నాడు తప్ప చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు .ఒకానొక సందర్భంలో లో నేను సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు డు దళితులు ఎవరు కూడా నాకు ఓటు వేయలేదని చెప్పారని అన్నారు. మా ముత్తాతల కాలం నుండి సుమారు వంద సంవత్సరాల నుండి కూడా మా బతుకులు పూరిగుడిసె లోనే ఉంటున్నాం అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి ఇల్లు కట్టి ఇచ్చిందో మా గ్రామ సర్పంచ్ కు పథకాలను ప్రవేశపెడుతున్న కేసీఆర్ కే తె లవాలని వారు వాపోతున్నారు .గ్రామంలో పండగ ,పబ్బం వచ్చినా మేమే ముందుండాలని అని ఆషాడ మాసం లో బోనాల పండుగ గ్రామంలో చేస్తే గ్రామ పెద్దలు అందరూ మా ఇంటికి వస్తారు . రహదారి చూసి కూడా మాకేం లే అన్నట్టు మౌనంగా ఉంటున్నారని వర్షాకాలం లో బురదమయంగా ఉన్నప్పటికీ వారందరూ పడుతూ లేస్తూ వచ్చి ఉంటారని అయినప్పటికీ గ్రామ సర్పంచ్ ను సిసి రోడ్డును వేయించాలని ఎన్నోసార్లు ఆడినప్పటికీ దళిత వాడ నుండి ఏ ఒక్క ఓటు కూడా వేయలేదని చిరాకు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాసాయిపేట గ్రామంలోని దళిత వాడను ఆదుకోవాలని అని విజ్ఞప్తి చేస్తున్నారు.