YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

గుడ్ ల‌క్ ఫిష్ మృతి.. దేశాధ్యక్షుడి సంతాపం

గుడ్ ల‌క్ ఫిష్ మృతి.. దేశాధ్యక్షుడి  సంతాపం

న్యూఢిల్లీ సెప్టెంబర్ 10,
సాధార‌ణంగా ఎవ‌రైనా ప్రముఖులు మరణించిన‌ప్పుడు లేదంటే ఏదైనా ఘోర ప్రమాదంలో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయిన‌ప్పుడు దేశాధ్య‌క్షులు సంతాపం తెలుపుతారు. అయితే, జాంబియా అధ్యక్షుడు ఎడ్గార్ లుంగూ మాత్రం ఓ చేప మరణిస్తే సంతాపం తెలియ‌జేశారు. చేప చ‌నిపోతే అధ్య‌క్షుడు సంతాపం తెలుప‌డం ఏమిటి అనుకుంటున్నారా..? ఎందుకంటే ఆ చేప‌కు కొన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. జాంబియాలోని కాప‌ర్‌బెల్ట్ యూనివ‌ర్సిటీలో ఆ చేప ఉండేది.  మాఫిషి అనే ఆ చేప ఒక సెంటిమెంట‌ల్ చేప‌. విద్యార్థులు పరీక్షలకు హజరయ్యేముందు ఆ చేపను చూసి వెళ్లేవారు. దానివ‌ల్ల వారికి అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని న‌మ్మ‌కం. మ‌రికొంద‌రు ఆ చేప‌ను కొద్దిసేపు త‌దేకంగా చూడటం ద్వారా మానసిక ఒత్తిడి త‌గ్గుతుంద‌ని భావించేవారు. అందుకే ఆ చేపకు గుడ్ ల‌క్ ఫిష్ అని పేరు ప‌డింది. యూనివ‌ర్సిటీ చెరువులో గ‌త 20 ఏండ్లుగా ఆ చేప ఉంటున్న‌ది. ఇప్పుడు ఆ చేప చ‌నిపోవ‌డంతో విద్యార్థులు బాధ‌ప‌డుతున్నారు. దానికి మృతి సంతాపంగా క్యాంప‌స్ చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. అందుకే ఆ చేప ప్ర‌త్యేక‌త‌ను తెలుసుకున్న జాంబియా అధ్య‌క్షుడు కూడా దానికి సంతాపం తెలిపారు. కాగా చేప మృత‌దేహాన్ని ఇంకా ఖ‌న‌నం చేయ‌లేదు. ఆ చేప‌కు కుళ్లిపోకుండా కెమిక‌ల్స్ పూసి ల్యాబ్‌లో భ‌ద్ర‌ప‌ర్చాల‌ని యూనివ‌ర్సిటీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

Related Posts