YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు నేత‌ల‌పై 263 కేసులు

తెలుగు నేత‌ల‌పై 263 కేసులు

న్యూఢిల్లీ, సెప్టెంబ‌ర్ 10, 
దేశంలో తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,442 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు సుప్రీంకోర్టు వివిధ హైకోర్టుల నుంచి అందిన నివేదికల్లో వెల్లడయ్యింది. వీరిలో సిట్టింగ్ ప్రజాప్రతినిధులపై 2,556 కేసులు ఉన్నట్టు తేలింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని 2015లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదంటూ హక్కుల ఉద్యమ నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.ఈ కేసులో సుప్రీంకోర్టుకు సహాయం చేయడానికి అమికస్‌ క్యూరీగా సీనియర్ న్యాయవాది హన్సారియా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరళ్లు సమర్పించిన సమాచారం ఆధారంగా ఆయన ఈ అఫిడవిట్‌ సమర్పించారు.సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల్లో విచారణలను వేగవంతం చేయాలని సుప్రీం సూచించింది. దీంతో పాటు కేసులకు సంబంధించిన సమాచారాన్ని పట్టికరూపంలో ఉంచాలని అమికస్ క్యూరీ విజయ్ హన్సరియా, న్యాయవాది స్నేహ కలితలను సుప్రీంకోర్టు కోరింది.సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రత్యేక కోర్టులతో సహా వివిధ కోర్టులలో సిట్టింగ్, మాజీ ఎంపీలు / ఎమ్మెల్యేలపమొత్తం 4,442 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 2,556 కేసులు సిట్టింగ్ ప్రజాప్రతినిధులపై ఉన్నాయి. యావజ్జీవిత ఖైదు శిక్షార్హమైన తీవ్ర నేరాలకు సంబంధించి 413 కేసులు కాగా.. ఇందులోని 174 కేసులలో సిట్టింగ్ ఎంపీలు / ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు.యూపీలో అత్యధికంగా 35 మంది సిట్టింగ్‌లు తీవ్ర నేరాలలో నిందితులుగా ఉన్నారు. తర్వాతి స్థానంలో బీహార్ (30), కర్ణాటక (27), మహారాష్ట్ర (17) ప్రజాప్రతినిధులు ఉన్నట్టు అమికస్ క్యూరీ తెలియజేశారు. చాలా కేసుల్లో తీవ్రమైన నేరాలకు పాల్పడినవారిపై ఇప్పటి వరకూ ఛార్జ్‌షీట్ కూడా దాఖలుకాలేదని తెలిపారు. యూపీలోని ఎంపీలు / ఎమ్మెల్యేలపై అత్యధికంగా 446, కేరళలో 310 కేసులు ఉన్నాయి. ఇక, తెలుగు రాష్ట్రాల్లో తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 263 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని విజయ్‌ హన్సారియా బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.వీటిలో ఏపీలో 145, తెలంగాణలో 118 కేసులు నడుస్తున్నాయని, అత్యధికంగా సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేలపైనే ఉన్నాయని వివరించారు. తెలంగాణలోని ఓ సిట్టింగ్‌ ప్రజాప్రతినిధిపై యావజ్జీవ శిక్ష పడే స్థాయి కేసు ఒకటి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలో ఈ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన కోర్టుల్లో కేసులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న 85 కేసుల్లో సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. అధికారులు జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించిన వీరిపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద నమోదైన కేసుల్లో 21 మంది ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. వీరిపై నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పదేళ్ల వరకు శిక్ష పడేందుకు అవకాశం ఉన్న మరికొన్ని కేసులు గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.తెలంగాణలో నమోదైన 118 కేసుల్లో 107 కేసుల్లో సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. ఇవన్నీ హైదరాబాద్‌ ప్రత్యేక కోర్టు వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 2012లో నమోదైన కేసులు సమన్ల జారీ దశలోనే ఉన్నాయి.

Related Posts