YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వరుసకు కొడుకయ్యే వ్యక్తితో మహిళ రాసలీలలు.. ప్రియుడితో కలిసి భర్త దారుణ హత్య

వరుసకు కొడుకయ్యే వ్యక్తితో మహిళ రాసలీలలు..  ప్రియుడితో కలిసి భర్త దారుణ హత్య

కాకినాడ సెప్టెంబర్ 10 
వివాహేతర సంబంధాలు ఉసురుతీస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ నేర ప్రవృత్తి ఎక్కువవుతోంది.సమాజంలో నానాటికీ విలువలు కొరవడుతున్నాయి. క్షణిక సుఖం కోసం వైవాహిక బంధాన్ని తెంచుకోవడమే కాదు.. హత్యలకు కూడా వెనుకాడటంలేదు. నిండు నూరేళ్లు తోడుగా ఉంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరచి, వివాహేతర సంబంధాల కోసం కట్టుకున్నవారినే కడతేర్చుతున్నారు. తాజాగా, ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. భర్త గాఢనిద్రలో ఉన్నప్పుడు అతడిపై కర్ర, కత్తితో దాడిచేసి హత్యకు పాల్పడింది.తూర్పుగోదావరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు మండలం చింతలూరులో జంకల అప్పారావు అలియాస్‌ వరహాలు(35) తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. వేరే వ్యక్తితో వరహాలు భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, ఈ విషయం అతడికి తెలిసి మందలించాడని తెలిపారు. అంతేకాదు, అతడు వరుసకు కొడుకు కావడంతో అప్పారావును మరింత వేదనకు గురిచేసిందని అన్నారు...

Related Posts