హైదరాబాద్ సెప్టెంబర్ 11,
సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ తో బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తార్నాకలోని బీజేపీ నగర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. కౌన్సిల్ సమావేశాలు ఉన్నందున ఆయనను పోలీస్ ఎస్కార్ట్ తో కౌన్సిల్ సమావేశాలకు పంపించారు. అయన తో పాటు ఉన్న పలువురు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి ఓయూ పీఎస్ కు తరలించారు. ఈ సందర్బంగా రాంచందర్ రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కానీ తెరాస ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయం లో అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన తెరాస నేడు మజ్లీస్ పార్టీ కి తలొగ్గి విమోచన దినాన్ని నిర్వహించటం లేదన్నారు.