హైదరాబాద్ సెప్టెంబర్ 11
బిజెపి శుక్రవారం బిజెపి నేతల అసెంబ్లీ ముట్టడి విజయవంతం అయింది. తెలంగాణ ప్రజల పక్షాన బిజెపి నిజాం రజాకార్ల వారసుల పక్షాన కెసిఆర్ వున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. చలో అసెంబ్లీ నేపధ్యంలో అయనను పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బండి సంజయ్ మట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష లక్ష్యం తెలంగాణ విమోచన దినోత్సవ అధికారిక నిర్వహణ డిమాండ్ ముట్టడి తో మరోసారి రుజువయింది. బీజెపి నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తారని అసెంబ్లీ ముట్టడి విజయంతో రుజువైంది. తెలంగాణ విమోచన పోరాట వీరుల స్ఫూర్తితో ఎనిమిదవ నిజాం కేసిఆర్ మెడలు వంచుతాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల బలప్రయోగంతో బీజేపీ నాయకులు కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులు కెసిఆర్ ప్రభుత్వంది పిరికిపంద చర్య అని అయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి బిజెపి నాయకులు కార్యకర్తలు తరలివస్తూనే ఉంటారు.బిజెపి కార్యకర్తల శక్తిని కెసిఆర్ ప్రభుత్వం తట్టుకోలేదు.త్వరలోనే కెసిఆర్ ను ఫామ్ హౌస్ కే శాశ్వతంగా పరిమితం చేస్తామని అయన అన్నారు.