హైదరాబాద్ సెప్టెంబర్ 11
రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను మాత్రమే రద్దు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వీఆర్వో వ్యవస్థను కొనసాగించాలన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేవలం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నాం. మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడున్న వీఆర్వో వ్యవస్థ అరాచకాలకు పాల్పడుతుంది. అందుకే రద్దు చేశామన్నారు. ఇక రెవెన్యూ విభాగంలో అన్ని రికార్డులు ఉంటాయి. సర్వే సెటిల్మెంట్ వ్యవస్థ కూడా ఉంటుందన్నారు. ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రజా అవసరాలకు మాత్రమే అసైన్డ్ భూములను తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరి అసైన్డ్ భూములను తీసుకోవడం లేదు. కేవలం ప్రాజెక్టులు, ప్రజా ప్రయోజనాల నిమిత్తమే ప్రభుత్వం భూములను తీసుకుంటున్నదని సీఎం తెలిపారు.