YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మరో వివాదంలో కంగనా

మరో వివాదంలో కంగనా

ముంబై, సెప్టెంబర్ 12
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చెందిన ముంబైలోని బంగ్లాను అక్రమ కట్టడంగా పేర్కొంటూ అధికారులు కూల్చివేయగా.. ఇండిగో విమానంలో హుటా హుటిన కంగన చండీగఢ్‌  నుంచి చేరుకున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. సెప్టెంబర్ 9న కంగనా ప్రయాణించిన విమానంలో కోవిడ్-19 ప్రోటోకాల్స్ నిబంధనల  ఉల్లంఘించారనే ఆరోపణలతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రెగ్యులేటరీ ఇండిగో సంస్థకు నోటీసులు జారీ చేసింది. చండీగఢ్-ముంబై విమానంలో  చాలామంది మాస్క్‌లు ధరించలేదని, భౌతిక దూరాన్నిపాటించలేదంటూ వచ్చిన ఆరోపణలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఇండిగోను ఆదేశించింది.తాజాగా, శనివారం ఓ  ప్రకటన జారీచేసిన డీజీసీఏ.. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విమానంలో ఫోటోలు తీసినట్టు గుర్తించినట్టయితే రెండు వారాలపాటు సర్వీసులను  నిలిపివేయాలని విమానయాన సంస్థలను హెచ్చరించింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలను ఎదుర్కోవాల్సిన ఉంటుందని పేర్కొంది.డైరెక్టర్ జనరల్,  జాయింట్ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ లేదా సివిల్ ఏవియేషన్ విభాగం రెగ్యులేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ లిఖితపూర్వకంగా మంజూరు చేసిన అనుమతి  నిబంధనలు, షరతులకు లోబడి తప్ప ఏ వ్యక్తి ఫోటోలు తీయరాదు’ అని శనివారం నాటి ప్రకటనలో తెలిపింది. అటువంటి విమానం ల్యాండింగ్, టేకాఫ్ లేదా డిఫెన్స్ ఏరోడ్రోమ్  వద్ద ఉన్నప్పుడు నిబంధన వర్తించదు అని పేర్కొంది.‘ఇప్పటి నుంచి ఏదైనా ఉల్లంఘన జరిగితే ఆ నిర్దిష్ట మార్గంలో విమాన సర్వీసులు కొంతకాలం నిలిపివేయబడతాయి..  ఉల్లంఘనకు కారణమైన వారిపై అన్ని చర్యలు వైమానిక సంస్థ తీసుకున్న తర్వాతే రెండు వారాల తర్వాత విమాన సర్వీసులు పునరుద్ధరించాలి’ కఠిన హెచ్చరికలు చేసింది.  ఇటువంటి ఉల్లంఘన అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్వహించడంలో రాజీకి దారితీస్తుందని వ్యాఖ్యానించింది.డీజీసీఏ నోటీసులపై స్పందించిన ఇండిగో తాము నిర్దేశిత  నిబంధనలను అన్నీ పాటించామంటూ వివరణ ఇచ్చింది. క్యాబిన్ సిబ్బంది, అలాగే ఫోటోగ్రఫీని పరిమితం చేసే కెప్టెన్ ప్రకటనలతో సహా అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను  అనుసరించామని తెలిపింది.  

Related Posts