YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చినజీయర్ కు మాతృవియోగం

చినజీయర్ కు మాతృవియోగం

హైద్రాబాద్, సెప్టెంబర్ 12
 చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. చినజీయర్ స్వామి తల్లి అలివేలుమంగ కన్నుమూశారు. 85 ఏళ్ల వయస్సు గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో  బాధపడుతున్నారు. ఆమె శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దీంతో చినజీయర్ స్వామి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తల్లి మరణాన్ని స్వామి  తట్టుకోలేకపోతున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమం సమీపంలో అలివేలుమంగ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ  సందర్భంగా ఆశ్రమానికి చెందిన పలువురు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. స్వామిజీ భక్తులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కరోనా నిబంధనల నేపథ్యంలో అతి  తక్కువ మంది నేపథ్యంలో అత్యక్రియల కార్యక్రమం పూర్తి చేశారు.  

Related Posts