YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

విపక్షాలకు అవకాశం ఇవ్వడంలేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

విపక్షాలకు అవకాశం ఇవ్వడంలేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్ సెప్టెంబర్ 14 
టీఆరెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. క్వశ్చన్ అవర్ లో ప్రతిపక్షానికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు. జీరో అవర్ లో కాంగ్రెస్ నుండి ఒకరికి మాట్లాడటానికే అవకాశం ఇస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.  సోమవార అయన గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఆటో రిక్షాలు, టూ వీలర్లకు ట్రాఫిక్ చలానాలు అధికంగా విధిస్తున్నారు. సీఎం ఆదేశాలను అనుసరిస్తూ ట్రాఫిక్ పోలీస్ అధికారులు భారీ జరిమానాలు వేయిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు కొద్దిగా అతిక్రమించినా ఎక్కువ ఫైన్ లు వేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రం మొత్తం చలనాలతో ఇబ్బందులు పడుతున్నారు. చలానా కట్టకపోతే పెనాల్టీలు వేస్తున్నారు. ఆటో తోలుకునే వారికి వారు సంపాదించే సగం డబ్బు చలనాలకే సరిపోతుంది. కరోనా కష్ట కాలంలో ఈ ఫైన్ లు వేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం అవసరమా అని అయన ప్రశ్నించారు.

Related Posts