YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరు అరెస్టు

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరు  అరెస్టు

హైదరాబాద్ సెప్టెంబర్ 14
బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరిని పోలీసులు  అరెస్టు చేసారు. కేసు వివరాలు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో మొదటి ముద్దాయి సాయి కృష్ణారెడ్డి, రెండవ ముద్దాయి నిర్మాత అశోక్ రెడ్డి, మూడవ ముద్దాయిగా దేవరాజ్ రెడ్డిని పేర్కోన్నారు. సోమవారం నాడు సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ను అరెస్టు చేశారు,. పరారీలో వున్న త్వరలోనే అశోక్ రెడ్డిని అరెస్టు చేస్తామని అన్నారు. నిందితులు ముగ్గురు మృతురాలిని పెళ్లి చేసుకుంటామని నమ్మించారు. ఆ తర్వాత యువతిని పలు విధాలుగా వేధించారని అయన అన్నారు. వీరి బాధలు భరించలేకనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు. చనిపోవడానికి ముందు దేవరాజ్తో చాలా సేపు మాట్లాడినట్లు కాల్ రికార్డు ద్వారా వెల్లడయింది.  కొన్ని రోజుల క్రితం  తనను వెంటాడి వేధిస్తున్నట్లు దేవరాజ్ పై శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసిందని అయన అన్నారు.

Related Posts