న్యూఢిల్లీ సెప్టెంబర్ 14
టీఆర్ఎస్ నాయకులు కే కేశవరావు, ఆర్ సురేశ్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. కేశవరావు తెలుగు ప్రమాణం చేయగా, సురేశ్ రెడ్డి ఇంగ్లీష్లో ప్రమాణస్వీకారం చేశారు. సురేశ్ రెడ్డి ప్రమాణస్వీకారం అనంతరం వెంకయ్య స్పందించారు. సురేశ్ రెడ్డి మాజీ స్పీకర్ అని వెంకయ్య సభకు తెలియజేశారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ ప్రమాణస్వీకారం చేశారు.