YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సింగరేణి కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు

సింగరేణి కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు

మంచిర్యాల  సెప్టెంబర్ 15 
కరోనా మహమ్మారి సాకు చూపుతూ నిలిపివేసిన మెడికల్ బోర్డ్ అని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ర్   ఏరియాలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ఏఐటీయూసీ   కార్మిక సంఘం  ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య హాజరై నిరాహార దీక్షలో పాల్గొన్న సభ్యులకు పూలమాలలు వేసి సంఘీభావాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి పేరట కార్మికులకు రావాల్సిన ప్రధాన హక్కులను నిలిపివేస్తూ సింగరేణి యాజమాన్యం కార్మికుల కొట్టాలని చూస్తుందని ఆయన ఆరోపించారు అలానే 2019- 20 లో కంపెనీ కి వచ్చిన లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని మార్చి నెలలో కార్మికులు జీతాల నుండి కోత విధించిన 50 శాతాన్ని వెంటనే చెల్లించాలని కువైట్ బారిన పడిన వారితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న కార్మికులకు 14 రోజుల లీవ్  ప్రకటించాలని వీటితో పాటు తదితర ప్రధాన సమస్యలపై యాజమాన్యం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో రానున్న రోజులలో కలిసివచ్చే కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టి యాజమాన్యం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తామని ఆయన హెచ్చరించారు.

Related Posts