YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు పై రోజా మండిపాటు

చంద్రబాబు పై రోజా మండిపాటు

విజయవాడ సెప్టెంబర్ 15 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు వేషాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు తన ఇంట్లో ఆడపడుచులనే మోసం చేసిన వ్యక్తి అంటూ మండిపడ్డారు. అమ్మమ్మ ఆస్తిని సోదరీమణులకు ఇవ్వకుండా లోకేష్ పేరుతో సీఎం రాయించుకున్నారని ఆరోపించారు. అమ్మమ్మ ఆస్తిని నారా లోకేష్కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మహిళల తాళిబొట్లు తెంపేసేలా చంద్రబాబు పాలన సాగిందన్నారు. ఇప్పుడు పసుపు కుంకుమపేరుతో మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు రోజా.  2104లో డ్వాక్రామహిళలు రుణాలన్నింటిని మాఫి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... 14,200 కోట్లు ఉండే డ్వాక్రా రుణాలు 22 వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. చంద్రబాబు చేసిన మోసంతో వడ్డీ కలిపి డ్వాక్రారుణాలు వేలకోట్లకు పెరిగి పోయాయన్నారు. డ్వాక్రామహిళల రుణాలు మాఫి చేసి ఉంటే వారు అప్పుల పాలయ్యేవారు కాదన్నారు. చంద్రబాబుకు మళ్లీ ఓటు వేస్తే మహిళలు కడుపు మాడ్చుకోవాల్సిందేనని రోజా విమర్శించారు.

Related Posts