YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

కేరళలో... జార్జి ఫ్లాయిడ్‌ ఘ‌ట‌న‌

కేరళలో... జార్జి ఫ్లాయిడ్‌ ఘ‌ట‌న‌

తిరువ‌నంత‌పురం, సెప్టెంబ‌ర్ 16, 
అమెరికాలోని మినియాపొలిస్‌లో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ పట్ల పోలీసులు అత్యంత కర్కశకంగా ప్రవర్తించి, అతడి మరణానికి కారణమైన విషయం తెలిసిందే. కేరళలోనూ అటువంటి తరహా ఘటన చోటుచేసుకుంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఓ పోలీస్ అధికారి.. ఓ వ్యక్తిని నేలకేసి అదిమిపెట్టి అతనిపై కూర్చున్న ఫోటో అంతర్జాలంలో దర్శనమిచ్చింది. కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్‌ కాన్వాయ్‌‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించగా..ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.కేరళలో ఇటీవల సంచలనం సృష్టించిన బంగారం అక్రమ తరలింపు కేసులో మంత్రి జలీల్‌ను ఈడీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలంటూ యువజన కాంగ్రెస్ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. ఇదే సమయంలో మంత్రి జలీల్ మలప్పురం నుంచి తిరువనంతపురానికి వెళ్తుండగా అంగామలే వద్ద ఆయన కాన్వాయ్‌ను ఘోరావ్ చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.ఇదే సమయంలో పోలీసుల నుంచి తప్పించుకోడానికి ఆంటోనీ అనే కార్యకర్త పరిగెత్తుతూ కిందపడిపోయాడు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న ఓ పోలీస్ అధికారి అటుగా వస్తున్న మంత్రి కాన్వాయ్‌ వెళ్లిపోయేవరకు ఆంటోనీని బలవంతంగా నేలకు అదిమిపెట్టి ఉంచారు.దీనిని గమనించి మిగతా కార్యకర్తలు అక్కడకు చేరుకుని అతడిని రక్షించారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేత వీటీ బలరామ్‌ ‘ప్రజలు ఇంకా పినరయి ప్రభుత్వం’ అనే క్యాప్షన్ జోడించి సోషల్ మీడియాలో ఫోటోను పోస్ట్‌ చేశారు. ఈ ఘటనను అమెరికాలో పోలీసుల కిరాతకానికి బలైన జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతంతో పోల్చుతూ నెటిజన్లు తీవ్ర తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.యువజన కాంగ్రెస్ కార్యకర్త ఆంటోనీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని గుర్తుకుతెచ్చిందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పీసీ విష్ణునాథ్ ఆరోపించారు. ప్రజలకు పోలీసులు రక్షణ కల్పించడంలేదు.. అవినీతిపరులను రక్షిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ఇంత వరకూ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే, కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నంలోనే యాదృశ్చికంగా ఇది జరిగి ఉంటుందని ఓ సీనియర్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు.

Related Posts