YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సాయిబాబా విగ్రహం ధ్వంసం

సాయిబాబా విగ్రహం ధ్వంసం

విజయవాడ సెప్టెంబ‌ర్ 16, 
విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహం ధ్వంసం కావడం కలకలం రేపింది. శ్రీ షిర్డీసాయిబాబా మందిరం  బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Related Posts