YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహిళా అభ్యున్నతే సీఎం జగన్ లక్ష్యం జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

మహిళా అభ్యున్నతే సీఎం జగన్ లక్ష్యం జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ప్రోద్దుటూరు సెప్టెంబర్ 16
మహిళా అభ్యున్నతి జగనన్న లక్ష్యమని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. శనివారం ఎర్రగుంట్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగనన్న అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా ఎంతగానో ఉపయోగపడుతుంద న్నా రు. వైఎస్ఆర్ ఆసరా అక్కాచెల్లెళ్లకు బాసటగా నిలుస్తుందని మహిళల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ అమ్మఓడి ద్వారా 43 లక్షల మంది తల్లులకు రూ. 350 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా 18 లక్షల మంది చెల్లెమ్మలకు రు.12 21 కోట్లు , వైయస్సార్ కాపు నేస్తం ద్వారా 2.36 లక్షల మందికి మూడు రూ.5.4 కోట్లు జగనన్న విద్యా దీవెన ద్వారా 12 లక్షల మందికి రూ.4 వేల కోట్లు, వైఎస్సార్ చేయూత ద్వారా 22 లక్షల మందికి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు 4.312  మందికి రూ1.40 కోట్లు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా తొలి విడతగా రూ.6,791 కోట్లు ఖాతాలో జమ చేయనున్నారు.దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. అలాగే త్వరలో 30 లక్షల మందికి మహిళల పేళ్ళల్తో పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మొదటి దశగా 5,23,4 51 మంది మహిళలకు రూ.  337.25 కోట్లు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Related Posts