YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

హనుమాన్ విగ్రహం ధ్వంసం

హనుమాన్ విగ్రహం ధ్వంసం

కాకినాడ సెప్టెంబ‌ర్ 17, 
తూర్పుగోదావరి జిల్లా లో మరో దారుణం జరిగింది. మరో హిందూ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసారు.  ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గర లో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరగ కొట్టారు.  దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు.   హనుమాన్ చెయి విరగగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఘటనా స్థలానికి వెళ్లి విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ తూ.గో.జిల్లా తెలుగు యువత ఉప అధ్యక్షులు పైల సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పరిశీలించారు.  జరిగిన ఘటనపై గ్రామస్తులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

Related Posts