YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

బాలిక ఫోటోలతో బ్లాక్ మెయిల్…ముగ్గురు ఆరెస్టు

బాలిక ఫోటోలతో బ్లాక్ మెయిల్…ముగ్గురు ఆరెస్టు

మేడ్చల్ సెప్టెంబ‌ర్ 17, 
జీడిమెట్ల పరిధి అయోద్యనగర్ లో బాలికను  ఫోటోలతో  బ్లాక్ మెయిల్ చేస్తున్న ముగ్గురిని  పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వివరాలు ఇలా వున్నాయి. ఇటీవలే ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కావడంతో బాలికకు  ఆమె తండ్రి స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు.తరువాత సదరు బాలిక ఇన్స్టా గ్రామ్  వాడడం ప్రారంభించింది. దాంతో ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఆ ముగ్గురు యువకులు తరచు  బాధిత బాలిక ఇంటికి వస్తుండేవారు. బాలిక ఫోటోలతో  బ్లాక్ మెయిల్ చేస్తూ సుమారు నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈనెల 14న బాలిక వద్దకు  ముగ్గురు యువకులు ఎలిశా(21), కిషోర్(19), రాంవికాస్(21) వచ్చారు. వీరి రాకను గమనించిన కుటుంబ సభ్యులు  వారిని ప్రశ్నించారు. తాము  పదవతరగతి మెటీరియల్ కోసం వచ్చినట్లు తెలిపారు. ఇటీవల ఇంట్లో డబ్బులు మాయమవుతుండడంతో బాలికను  ప్రశ్నించారు.  బాలికను నిలదీయగా అసలు విషయం తెలిపింది. అసలు విషయం కుటుంబసభ్యులకు తెలపడంతో  విషయం పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Related Posts