ఆసిఫాబాద్ సెప్టెంబర్ 17
ఈ రోజు కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో హైదరబాదు సంస్థానం భారత దేశం లో విలీనమైన దినం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ జరిపిన కాంగ్రెస్ పార్టీ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్.
ఈ సందర్భంగా విశ్వప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు ఉద్యమకారులు ఎందరో అమరులైయ్యారని తెలిపారు. ఇవ్వాళ కొన్ని మత ఛాందసవాద పార్టీలు చరిత్ర ను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డా పాల్వాయి హరీష్ బాబు, డిసిసి ఓబిసి చైర్మన్ దాసరి వెంకటేశ్, డిసిసి మైనార్టీ చైర్మన్ యూనుస్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, దేశ్ ముఖ్ శ్రీనివాస్, షబ్బీర్, కొండ తిరుపతి, జాడి దీపిక, చిప్పకూర్తి శ్రీనివాస్, షేరు పఠాన్, షేక్ అహ్మద్, యూసుఫ్ ఖాన్, జహీర్, ఇర్పాత్, వినోద్, సత్తిబాబు పాల్గొన్నారు.