నల్గొండ, సెప్టెంబర్ 18,
చాలామంది రాజకీయ నేతలు, సినిమా ప్రముఖులకు అభిమానులు రకరకాలుగా ఆరాధిస్తుంటారు. తాము అభిమానించే నాయకుడి కోసం కొందరు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మరికొందరైతే... గుళ్లు కట్టి మరి ఆరాధిస్తుంటారు. ఇప్పటికే పలువురు నేతలు, సినీ ప్రముఖులకు ఆలయాలు నిర్మించి ఆరాధిస్తున్న వారి గురించి విన్నాం చదివాం. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి ఓ అభిమాని గుడి నిర్మించాడు. అందులో మోదీ ఫోటో ఏర్పాటు చేసి తన అభిమానం చాటుకున్నాడు.అంతేకాదు ఆ గుడిని శాస్త్రయుక్తంగా ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన బైరు సతీశ్ అనే వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీకి వీరాభిమాని. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై అభిమానం పెంచుకున్నాడు. దీంతో ప్రధానికి గుడి కట్టాలనుకున్నాడు. తన ఇంటి ఆవరణలోనే చిన్న ఆలయాన్ని నిర్మించి అందులో మోదీ ఫోటోను ఏర్పాటు చేశారు