సీపీఎం జాతీయ మహాసభలకు రంగం సిద్దమయింది బుధవారం నుంచి ఈనెల 22 వరకు హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో సభలు జరగనున్నాయి. చివరిరోజు సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. మంగళవారం నాడు సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ,సీపీఎం నేతలు పరిశీలించారు. ఈ సందర్బంగా తమ్మనేని మాట్లాడుతూ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నాం. ఈ మహాసభలు దేశ రాజకీయాలు ,ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలపై పెను ప్రభావం చూపిస్తుందని అన్నారు. 25 కీలక తీర్మానాలపై మహాసభల్లో చర్చ ఉంటుంది. పరేడ్ గ్రౌండ్ లో సభ కోసం అనుమతి చేసుకుంటే ..రాజకీయ కక్ష్య తో బీజేపీ ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వలేదని అయన అరోపించారు. 22 వ తేదీన 3 గంటలకు మలక్ పేట నుంచి 25 వేల మందితో రెడ్ షర్ట్ వలంటీర్ల కవాతు ,నాలుగు గంటల కు భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. సభకు దాదాపు 3 లక్షల మంది వరకు ప్రజలు హాజరు అవుతారని అయన అంచనా వేసారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. జనాభా ఎక్కువ అయితే రోడ్ ప్రక్కలో ఫ్రొజెక్టర్ లు ఏర్పాట్లు చేస్తామని అన్నారు.