YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చిత్తశుద్ది లేదు

చిత్తశుద్ది లేదు

చిత్తూరు సెప్టెంబర్ 19 
పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి  అమరనాథ రెడ్డి శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ లోనే హిందూ దేవాలయాలపై దాడులు మతపరంగా ఒక విధమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.  గతంలో ఇలాంటి పరిస్థితి మేము ఎన్నడూ చూడలేదని అన్నారు.  ఈ తక్కువ కాలంలో ఒక్కసారిగా  ఎందుకు దేవాలయాలపై దాడులు జరుగుతున్న కార్యక్రమాలు  వస్తున్నాయో మొదట అర్థం కాలేదు. కానీ లోతుగా ఆలోచిస్తే దీని వెనుక ఏదైనా ఒక అజెండా ఉందా... రహస్య ఎజెండా  పెట్టుకుని ఈ దాడులను  నిర్వహించడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉందా.. ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కఠినంగా ఉంటే ఇటువంటివి జరుగుతాయా అని ప్రశ్నించారు.  ప్రభుత్వంలో ఉండే మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి ఈ విషయంలో అవహేళనగా, గేలి గా, తేలికగా మాట్లాడుతూ తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు మాట్లాడితే  ఈ పరిస్థితి ఎక్కడిదాకా తీసుకెళ్తోంది అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అయన అన్నారు.  ఈ దేశం అన్ని  రకాల మతాలకు నిలయం. ఇక్కడ రకరకాల సంస్కృతులు, విభిన్న జాతులు, అన్ని మతాల కలయికే  భారతదేశం.. అటువంటి చోట ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి ఎందుకు ఆస్కారం ఉంది. ఇక పత్రికలలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్   ఓ విషయాన్ని టూకీగా ప్రకటన చేశారని అయన అన్నారు.

Related Posts