YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆసక్తికరంగా ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యవహారం

ఆసక్తికరంగా ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యవహారం

ఏలూరు, సెప్టెంబర్ 18
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న ఎంపీ కార్యాలయం పేరును మార్చేశారు. గతంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నరసాపురం పార్లమెంట్ సభ్యుల వారి కార్యాలయం పేరును.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారు. అంతేకాదు అక్కడ ఫ్లెక్సీల్లో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫొటోలు కూడా తొలగించారు. దీనిపై ఎంపీ రఘురామ స్పందించాల్సి ఉంది.ఇదిలా ఉంటే న్యాయ వ్యవస్థపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై రఘురామ స్పందించారు. పార్లమెంట్‌ లోపల, బయట న్యాయవ్యవస్థపై దాడి జరుగుతోందని.. కోర్టులపై ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. 151 సీట్లు వచ్చినంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చలేరన్నారు. ఏదైనా తప్పు జరిగితే ఇలా చిల్లర అల్లరి సరికాదని.. న్యాయవ్యవస్థపై దాడి సరికాదన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులు తప్పుబడుతున్నాయని ఎంపీలు అంటున్నారు.. కానీ ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉండటం వల్లే కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయని వ్యాఖ్యానించారు.రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంట్‌లో మూడో వంతు బలం ఉండాలి. అసెంబ్లీలో ఉంటే సరిపోదు అని సెటైర్లు పేల్చారు ఎంపీ. చట్టం తెలిసిన వాళ్లు ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు. న్యాయవ్యవస్థపై ఈ పుస్తకాలేంటో.. నాకు అర్థం కావడం లేదు. న్యాయవ్యవస్థకు అత్యున్నత గౌరవం ఇవ్వాలన్నారు. ఎంపీలు ప్రత్యేక హోదా , రైల్వే జోన్, దేవాలయాలపై మాట్లాడరని విమర్శించారు. గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని.. మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం తప్పు.. మనమూ ఓ రోజు గత ప్రభుత్వం అవుతామన్నారు.సహచర ఎంపీలతోనే తనను కొట్టిస్తామని నీచంగా మాట్లాడిస్తున్నారని.. వారి భవిష్యత్ ఏంటో త్వరలోనే తేలుస్తాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థాయిలో లేనని. తన ఒంటిపై చేయి పడితే కాపాడేందుకు హేమహేమీలున్నారన్నారు. పులివెందులలో 10 వేల మందితో సమావేశం పెడతాను.. అక్కడ తనను ప్రేమించేవారున్నారు. ప్రభుత్వం ఎన్ని ఉన్మాద చర్యలు చేసిన కోర్టులు చిరంజీవులుగా మిగులుతాయన్నారు

Related Posts