YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

గ‌డువుకు ముందే ముగియనున్న పార్ల‌లమెంటు స‌మావేశాలు!

గ‌డువుకు ముందే ముగియనున్న పార్ల‌లమెంటు స‌మావేశాలు!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20
పార్ల‌ిమెంటు స‌మావేశాలు గ‌డువుకు ముందే ముగిసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో కేంద్రం పార్లమెంట్ వ‌ర్షాకాల‌ సమావేశాలను కుదించే యోచనలో ఉన్న‌ట్లు తెలుస్తుంది. దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతుండ‌టం, పార్ల‌మెంటు స‌భ్యులు కూడా చాలా మంది క‌రోనా బారిన ప‌డుతుండ‌టం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్రం సెష‌న్‌ను కుదించాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలిసింది. పార్ల‌మెంటుకు చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్ అధికారులు ఈ విష‌యాన్ని అన‌ధికారికంగా వెల్ల‌డించారు.ముందుగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ వ‌ర్షాకాల‌ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణ‌యించింది. ఆ మేర‌కే సెప్టెంబ‌ర్ 14న స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో గ‌డువు కంటే వారం ముందుగానే స‌మావేశాల‌ను ముగించాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు తెలిసింది. అయితే లోక్‌స‌భ‌, రాజ్యస‌భ సెక్రెట‌రీలు మాత్రం ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు నిరాక‌రించారు.

Related Posts