కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ కాలనీలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. బైరెడ్డి నగర్ కాలానీకి చెందిన ఇద్దరు పిల్లలు హరీష్ ,రేవంతు లు బహిర్భూమి కి వెళ్లారు. అక్కడ మాటువేసిన గుర్తు తెలియని కిడ్నాపర్లు చిన్నారుల నోరు మూసి తీసుకెళ్లడినికి ప్రయత్నించారు. ఆదే సమయంలో రేవంత్ తన జేబులో వున్న ఉంగరాన్ని తీసి అగంతకుడి చేతికి గట్టిగా గుచ్చాడు. చేతికి గాయం కావడంతో ఆ వ్యక్తి రేవంత్ ను వదిలి వేశాడు. దాంతో తప్పించుకొని తన స్నేహితు డైన హరిశ్ ను ను రక్షించేందుకు దొరికిన రాయితో కిడ్నాపర్ల పైకి విసిరాడు. చిన్నారులు కేకలు వేయడం తో వారి కుటుంబసభ్యులు, కాలనీ వాసులు పరుగులు పెట్టి వెళ్లారు. అంతే, కిడ్నాపర్లు తమ వాహనంతో పారిపోయారు. స్థానికులు సమాచరం అందించడం తో పోలీసులు వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. కిడ్నాపర్ల వాహనం లో మరో ఇద్దరి చిన్నారులు ఉన్నట్లు హరీష్,రేవంతులు గుర్తించినట్లు సమాచారం