YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓ ప్రైవేటు బస్సులో రూ.100కోట్లు స్వాధీనం

ఓ ప్రైవేటు బస్సులో రూ.100కోట్లు స్వాధీనం

త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌ జిల్లా తిప్పగానిపల్లి వద్ద పోలీసులు ఓ ప్రైవేటు బస్సులో రూ.100కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం-బళ్లారి జాతీయరహదారిపై తిప్పగానిపల్లి వద్ద మంగళవారం ఓ ప్రైవేటు బస్సును తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఆ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు లెక్కించగా రూ.100కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది. ఈ నగదును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న దానిపై కర్ణాటక పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంత మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. 

Related Posts