YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లకు ఆదేశం

జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లకు ఆదేశం

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జాతీయరహదారులకు భూసేకరణ, హరితహారం, సివిల్ సర్వీసెస్ డే, భూరికార్డుల నవీకరణ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యక్రమాలు, గ్రామస్వరాజ్ అభియాన్,  డాష్ బోర్డ్, 2021 సెన్సస్ డేటా సేకరణకు ముందస్తు చర్యలు తదితర అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జాతీయ రహదారుల భూసేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని, ఈ నెలాఖరులోగా భూసేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. ల్యాండ్ రికార్డ్సు అప్ డేషన్ కు సంబంధించి రైతుల ఆధార్ సీడింగ్ ను, తహసీల్ధార్లు తమ డిజిటల్ సిగ్నేచర్ లను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటికే ముద్రించిన 20 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలకు పంపించామని,ఒరిజినల్ రికార్డులతో సరిచూసుకోవాలని, ఏమైనా తేడాలుంటే పంపాలని సి.యస్ తెలిపారు. రెవెన్యూ శాఖ స్పెషల్ సి.యస్ శ్రీ రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ, ధరణి వెబ్ సైట్, భూరికార్డుల ఆధునీకరణ, తదితర అంశాలపై సి.యం కె.చంద్రశేఖర్ రావు గారు ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని వివరించారు. మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించి మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలలకు అవసరమైన భూమి కోసం వక్ఫ్  భూములను గుర్తించాలని సి.యస్ కలెక్టర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ శాఖకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని బడ్జెట్ లో 2 వేల కోట్లు కేటాయించామని, 204 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని, కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి, మైనారిటీ శాఖపై సమీక్ష చేయాలని ఆదేశించారు. మైనారిటీ కార్యదర్శి శ్రీ దాన కిషోర్ మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల ప్యూరిఫికేషన్లో గుర్తించిన వక్ఫ్  భూములకు సంబంధించి ఎటువంటి ఆక్రమణలు లేని  వక్ఫ్ భూములకు వక్ఫ్ సంస్ధల పేర పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కొన్నిచోట్ల ముతావల్లీల పేరిట ఉన్న భూములను వక్ఫ్  సంస్ధ ల పేర పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని అన్నారు. మైనారిటీ శాఖ ద్వారా 319 మైనారిటీ సంస్ధలకు 35 కోట్ల మేర అభివృద్ధి పనులు, మరమత్తుల కోసం నిధుల మంజూరు చేశామని, ఈ పనులను వెంటనే పూర్తి చేయాటానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి, 46 చోట్ల గుర్తించిన భూములను అప్పగించాలని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాలలు, హాస్టళ్ళకు భూములను గుర్తించాలని దానకిషోర్ కోరారు.షెడ్యూల్డు కులాల రెసిడెన్షియల్ పాఠశాలలకు 72 చోట్ల భూములను గుర్తించాల్సి ఉందని, మరో 10 చోట్ల గుర్తించిన భూములను అప్పగించాల్సి ఉందని, 114 చోట్ల ఇప్పటికే అప్పగించారని కలెక్టర్లకు సి.యస్ తెలిపారు.ఏప్రిల్ 21 న సివిల్ సర్వీసెస్ డే నిర్వహణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సి.యస్ ఆదేశించారు. జి.ఏడి-డాష్ బోర్డ్స్ కు అవసరమైన బేసిక్ డాటాను వెంటనే అప్ లోడ్ చేయాలని సి.యస్ కోరారు. వాట్సాప్ ద్వారా నిర్ణీత సమయంలో సింగిల్ కమ్యూనికేషన్ (Drop Box) అందుతున్న విషయంపై కలెక్టర్లతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 7 ముఖ్యపథకాలపై కేంద్ర ప్రభుత్వ ద్వారా ప్రత్యేక అధికారులు సమీక్షిస్తున్నారని వీటిపై దృష్టి సారించాలన్నారు. 2021 సెన్సెస్ డాటా సేకరణకు సంబందించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఈ విషయమై జిఏడి ద్వారా ఇప్పటికే డి.ఓ.లెటర్ వ్రాయటం జరిగిందన్నారు. ఈ అంశంపై జిఏడి ముఖ్యకార్యదర్సి శ్రీ అధర్ సిన్హా మాట్లాడుతూ జిల్లాలు, డివిజన్, మండలాల పునఃవ్యవస్ధీకరణను దృష్టిలో ఉంచుకోవాలని, తప్పిపోయిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాల మద్య ప్రత్యేకంగా సమన్వయం చేసుకోవాలని జిల్లా సమావేశాలల్లో సిబ్భందిని సెన్సిటైజ్ చేయాలని, డిఆర్ఓ, సిపిఓ, డిపిఓ, డిఈఓ, మున్సిపల్ కమీషనర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు.2018 హరితహారానికి సంబంధించి జిల్లా స్ధాయిలో యాక్షన్ ప్లాన్ ను వెంటనే అప్ లోడ్ చేయాలని, నర్సరీలకు సంబంధించి ప్లానింగ్ మెటీరియల్ ను సమకూర్చుకోవాలని సి.యస్ ఆదేశించారు. హరితహారంలో భాగంగా ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత నివ్వాలని, మొక్కల సర్వైవేల్ డాటాను వెంటనే అప్ లోడ్ చేయాలన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కల సంరక్షణ, పర్యవేక్షణకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామి పథకానికి సంబందించి నిధులు మంజూరు అయ్యాయని, వెంటనే నిధులు విడుదల అవుతాయని తెలిపారు.సి.యం ఓఎస్ డి శ్రీమతి ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని మొక్కల సంరక్షణలో భాగంగా వారంలో ఒకరోజు మొక్కలకు నీరు పోయడానికి జిల్లాలలో  అందరిని భాగస్వామ్యులను చేయాలన్నారు.సి.యం డాష్ బోర్డు ద్వారా నిరంతర పర్యవేక్షిస్తున్నారని మొక్కల సంరక్షణకు తగు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి,జిఏడి ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా,  ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్,  మైనారిటీ సంక్షేమ కార్యదర్శి  దానకిషోర్,  జి.హెచ్ ఎంసి కమీషనర్  బి.జనార్ధన్ రెడ్డి, పంచాయతీ రాజ్ కమీషనర్  నీతూ ప్రసాద్,   జ్యోతి బుద్ధప్రకాశ్, సి.యం ఓఎస్ డి  కమీషనర్ ప్రియాంకా వర్గీస్ లతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Posts