YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఏడు రాష్ట్రాలల‌‌ ముఖ్య‌మంత్రుల‌తో మోడీ భేటీ

ఏడు రాష్ట్రాలల‌‌ ముఖ్య‌మంత్రుల‌తో మోడీ భేటీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 
ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉన్న ఏడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల‌‌ ముఖ్య‌మంత్రుల‌తో బుధ‌వారం ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా  జ‌రుగ‌నున్న ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రుల‌తోపాటు ఆ ఏడు రాష్ట్రాల ఆరోగ్య‌మంత్రులు కూడా పాల్గొన‌నున్నారు. ఆయా రాష్ట్రాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న తీరు, ఆ వైర‌స్‌ను అరిక‌ట్ట‌డానికి  చేప‌డుతున్న చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. క‌రోనా విస్తృతి ఎక్కువ‌గా ఉన్న ఏడు రాష్ట్రాలు/‌కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో మ‌హారాష్ట్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌,  త‌మిళ‌నాడు, ఢిల్లీ, పంజాబ్ ఉన్నాయి. ఈ ఏడు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఆరోగ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మోదీ సెప్టెంబ‌ర్ 23న ఉన్న‌త‌స్థాయి భేటీ నిర్వ‌హించ‌నున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  

Related Posts