YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

హైటెక్ దొంగ‌త‌నం

హైటెక్ దొంగ‌త‌నం

మెద‌క్, సెప్టెంబ‌ర్ 23. 
మెదక్ జిల్లాలోని చేగుంట మండలం మాసాయిపేట వద్ద భారీ దోపిడీ జరిగింది. సెల్‌ఫోన్లు తరలిస్తున్న ఓ లారీ కంటైనర్ నుంచి దాదాపు రెండున్న కోట్ల విలువైన సెల్‌ఫోన్లను దుండగులు ఎత్తుకుపోయారు. సెల్ ఫోన్ల సంఖ్య దాదాపు 2400 అని పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ కంటైనర్ కొత్త ఫోన్ల లోడుతో చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తోంది. పక్కా ప్రణాళిక ప్రకారమే దొంగలు ఈ కంటైనర్‌‌ను దోచుకుపోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.సెల్‌ ఫోన్ల లోడుతో చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ భారీ కంటైనర్‌ను దొంగలు వెంబడించినట్లు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం వెంబడించి అనుకూలమైన ప్రాంతం రాగానే చోరీకి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద డ్రైవర్, సహాయకుడు భోజనం చేసేందుకు ఓ హోటల్ వద్ద లారీ ఆపారు. వారు భోజనాలకు లోనికి వెళ్లగానే ఈలోపు దొంగలు రూ.2.5 కోట్ల విలువైన 2,400 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లిపోయారు.  భోజనానంతరం డ్రైవర్ వచ్చి చూడగా కంటైనర్ ఖాళీగా కనిపించింది. కేవలం భోజనం చేసేంత వ్యవధిలో దొంగలు కంటైనర్ తాళాలు పగలగొట్టి అంత పెద్ద ఎత్తున సరకును తరలించుకుపోవడం విస్మయం కలిగిస్తోంది. దీంతో వెంటనే డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దొంగలను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Related Posts