మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయడం లో ప్రభుత్వం విఫలం అయింది. దళారుల చేతిలో మొక్కజొన్న రైతులు నష్టపోతున్నారు. మిర్చిరైతుల ఇన్సూరెన్స్ లో పెద్ద స్కాం జరిగిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ఇన్సురెన్సు కంపెనీలకు ప్రభుత్వం 350 కోట్ల ప్రీమియం బకాయిపడింది .. దీంతో పంట నష్టం జరిగినపుడు భీమా కంపెనీలు రంగ ప్రవేశం చేయడంలేదు. గత నాలుగేళ్ళ లో ఈ ప్రభూత్వం ఏ ఒక్క రైతుకు ఇన్ పుట్ సబ్సిడి అందించలేదని అయన అన్నారు. రబీ ఖరీఫ్ ప్రణాళికలు రూపొందించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమయిందని అయన విమర్శించారు.