YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రి జయరాం తనయుడి బెంజి కారు వ్యవహారం ఏసీబీకి వినతి పత్రం ఇచ్చిన టీడీపీ

మంత్రి జయరాం తనయుడి బెంజి కారు వ్యవహారం ఏసీబీకి వినతి పత్రం ఇచ్చిన టీడీపీ

విజయవాడ సెప్టెంబర్24 
ఏపీ కార్మిక శాఖ మంత్రి జయరాం తనయుడు కార్ విషయంపై టిడిపి ఏసీబీకి వినతిపత్రం అందించించింది.మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు , వెలగపూడి,మాజీ ఎమ్మెల్యే రామానాయుడు ఏసీబీ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు.కార్మిక శాఖ మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్ అవినీతి పై ఆధారాలతో బయటపెట్టినట్లు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు.ఒక వ్యాపారస్తుడికి అంత ఖరీదైన కారు ఎందుకు బహుమతి ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.రాష్ట్రం లో అవినీతి జరిగితే క్షేమించను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.అవినీతి పై ఫిర్యాదు చేసేందుకు ఉన్న కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకూ స్పందన లేదని చెప్పారు.కారు విషయంలో ఆధారాలు బయట పెట్టిన ఎందుకు స్పందించడం లేదని,అచ్చంనాయుడుని ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.మంత్రి జయరాంని వెంటనే మంత్రి పదవి నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు.ఏసిబి వద్ద న్యాయం జరగకపోతే గవర్నర్ ను కలుస్తామని ఈ సందర్బంగా అయ్యన్న చెప్పారు.

Related Posts