YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మామను సందర్శించిన జగన్

మామను సందర్శించిన జగన్

హైద్రాబాద్, సెప్టెంబర్ 24 
తిరుపతి నుంచి హైదరాబాద్‌‌కు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి వచ్చారు. తన మామ గంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.ఏపీ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మామ గంగిరెడ్డిని పరామర్శించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌‌కు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గచ్చిబౌలిలోని కాంటినెంటల్  ఆసుపత్రికి వచ్చారు. తన మామ గంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి అనారోగ్యంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందుకే సీఎం  జగన్ తన షెడ్యూల్ మార్చుకుని హైదరాబాద్ వచ్చారు. మళ్లీ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి వెళతారు.  అనారోగ్య కారణాలతో వైఎస్ భారతి తండ్రి హైదరాబాద్ కంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఆయన పరామర్శకు వెళుతున్నారు. అంతక ముందు గురువారం ఉదయం జగన్  కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కర్ణాటక సత్రాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం రాత్రి ఏపీ సీఎం తిరుమల  శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే.  

Related Posts