హైదరాబాద్ సెప్టెంబర్ 25
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో ఏర్పడిన లోటును భర్తీ చేయడం సాధ్యం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సినీ సంగీతాన్ని తన గాత్రంతో మరోస్థాయికి తీసుకెళ్లిన గాయక దిగ్గజం అయన అని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం మృతికి అయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. బాలు సినీ ప్రపంచంలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా అత్యుత్తమ రీతిలో సేవలందించారని కేసీఆర్ కొనియాడారు. ఈ విషాద సమయంలో బాలు కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు అయన తెలిపారు.