YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివేకా హత్య కేసు... ఇద్దరు మహిళలను ప్రశ్నించిన సీబీఐ

వివేకా హత్య కేసు... ఇద్దరు మహిళలను ప్రశ్నించిన సీబీఐ

కడప, సెప్టెంబర్  26
మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వారం రోజులుగా పలువుర్ని అధికారులు ప్రశ్నించార.. కీలక ఆధారాలు కూడా సేకరించారు. తాజాగా కడపకు చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు, పులివెందులకు చెందిన బాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టారు. ఈ ఇద్దరు మహిళలలో మున్నా రెండో భార్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళలతో పాటు మున్నా చెప్పుల షాప్‌లో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారణకు పిలిచి ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు పులివెందులకు చెందిన చెప్పుల వ్యాపారి మున్నా నుంచి వివరాలు ఆరా తీశారు. సీబీఐ విచారణలో రోజు రోజుకు తెరపైకి కొత్త కొత్త వ్యక్తులు వస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్‌లో సీబీఐ అధికారులు ఈనెల 20న మొదటిసారిగా మున్నాను ప్రశ్నించారు. అనంతరం ఆయన బ్యాంకు ల్యాంకరులో భారీ మొత్తంలో ఉన్న నగదు గుర్తించిన సీబీఐ అధికారులు.. గత మూడు రోజులు క్రితం మున్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో మున్నా నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది.ఇటు వివేకా ఇంటిలో పనిచేస్తున్న రాజశేఖర్‌ను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన రోజు, ఆ ముందు రోజు ఏం జరిగిందో ఆరా తీశారు. రెండో విడత దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయనను మూడురోజల పాటు ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన నాటి ముందురోజు కాణిపాకం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయనను ప్రశ్నించారు. దీన్ని నిర్ధారించుకోడానికి ఇటీవల సీబీఐ అధికారులు రాజశేఖర్‌ను వెంటబెట్టుకుని చిత్తూరు జిల్లా కాణిపాకం వెళ్లొచ్చారు

Related Posts