న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక తేదీని కేంద్రం ప్రకటిచింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను రిలీజ్ చేసింది. దేశంలో 56 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక తేదీని కూడా ప్రకటించింది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నవంబర్ 10వ తేదీన కౌంటింగ జరగనుంది. టీఆర్ఎస్ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ స్థానానికిగాను ఇవాళ ఉపఎన్నిక షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.దుబ్బాకతో పాటు దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ ఇవాళే విడుదల అయ్యింది. అయితే.. తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు మాత్రం సీఈసీ ఇంకా తేదీలు ప్రకటించలేదు. అక్టోబర్ 9న దుబ్బాక ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్కు అక్టోబర్ 16 చివరి తేదీ. అక్టోబర్ 17న నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 19 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. అనంతరం నవంబర్ 3న పోలింగ్ , నవంబరు 10న కౌంటింగ్ జరగనుంది.