YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గుంటూరులో కీచకపర్వం

గుంటూరులో కీచకపర్వం

గుంటూరు, సెప్టెంబర్ 29 
గుంటూరులో కీచకపర్వం వెలుగుచూసింది. మగబిడ్డను కనలేదన్న సాకుతో మామ కోడలిపై కామంతో రగిలిపోయాడు. కొడుకు వేధిస్తున్నాడని చెబితే తనతో ఉండు అంటూ నీచానికి దిగజారాడు.  ఒంటరిగా ఉన్న సమయం చూసి అత్యాచారం చేసేందుకు యత్నించడంతో కోడలు భయపడిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో దారుణం  వెలుగులోకి వచ్చింది. పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు..గుంటూరులోని ఓ బట్టల దుకాణంలో పనిచేసే యువతికి అక్కడే పనిచేస్తున్న యువకుడితో పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరూ  పెద్దల అంగీకారంతో నాలుగేళ్ల కిందట 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నేళ్లు కాపురం సాఫీగానే సాగినప్పటికీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో అత్తింటి నుంచి వేధింపులు  మొదలయ్యాయి. తమకు వారసుడు కావాలంటూ భర్త సూటిపోటి మాటలతో నిత్యం నరకం చూపించడం మొదలుపెట్టాడు.భర్త ప్రవర్తన గురించి మామకి చెబితే కొడుక్కి సర్దిచెప్పాల్సిందిపోయి  కోడలిపైనే కామకోరికలతో రగలిపోయాడు. తనతో ఉండమంటూ డబుల్ మీనింగ్ డైలాగులతో నీచానికి దిగాడు. తనతో ఉంటే అంతా తాను చూసుకుంటానంటూ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు.  భరించలేకపోయిన బాధితురాలు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. పిల్లలను చూడాలన్న సాకుతో అక్కడికి వచ్చిన మామ.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కోడలిని రేప్ చేసేందుకు  ప్రయత్నించాడు.ఆ దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోలేక భర్తకి చెబితే సర్దుకుపొమ్మంటూ షాకిచ్చాడు. సాటి మహిళ కదా.. అర్థం చేసుకుంటుందని అత్తకి చెబితే ఈ రోజుల్లో ఇవన్నీ  మామూలేనంటూ ఆయనకే వత్తాసు పలికింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన భర్త, మామ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ  గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. స్పందించిన ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీసులను ఆదేశించారు.  

Related Posts