YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నాని పేషీలో ఫోర్జరీ పత్రాలు

నాని పేషీలో ఫోర్జరీ పత్రాలు

విజయవాడ, సెప్టెంబర్ 29 
మంత్రి కొడాలి నాని పేషీలో ఫోర్జరీ పత్రాల వ్యవహారం కలకలంరేపింది. నకిలీ పత్రాలతో ఉద్యోగం కోసం ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. గుంటూరు జిల్లా నల్ల చెరువుకు చెందిన యాగయ్యకు  కొంతమంది తెలిసిన వ్యక్తులు, ఏపీ మంత్రి నాని పేషీలో అటెండర్ పేరు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. అతడి నుంచి రూ.3 లక్షల 40వేలు వసూలు చేశారు. ఆ తర్వాత సతీష్ వర్మ  ఉద్యోగం ఇవ్వాలని పౌరసరఫరాలశాఖకు నకిలీ పత్రాలు పంపారు. ఆ పత్రాన్ని యాగయ్యకు కూడా ఇచ్చారు.. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాకపోవడంతో అతడు ఆ నకిలీ పత్రంతో సంబంధిత శాఖ  అధికారుల్ని కలిశాడు.ఆ లెటర్ చూసిన సంబంధితశాఖ అధికారులు అవాక్కయ్యారు. వెంటనే ఈ పత్రాలపై ఆరా తీయడంతో మోసం బయటపడింది. దీంతో బాధితుడు తుళ్లూరు పోలీసులకు, సతీష్  వర్మతో పాటూ మరో ఐదుగురిపైనా ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఫోర్జరీ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.  

Related Posts