సిద్దిపేట సెప్టెంబర్ 29
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా షాదీముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసారు. మంత్రి మాట్లాడుతూ మూడేళ్లలో ఏడు లక్షల పేదింటి ఆడపిల్లలకు లక్ష రూపాయల సాయం చేసాం. ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల యాభై కోట్లు ఆడపిల్లల పెళ్లి కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆడపిల్ల పిల్ల పెళ్లికి దేశంలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క రూపాయి సాయం చేయడం లేదు. పెట్టుబడి సాయం ఇచ్చి రైతును కాపాడుకుంటున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వం. రెండు పంటలకు ప్రతీ ఎకరానికి కాళేశ్వరం నీరు ఇచ్చి పండిస్తాం. బీడీ కార్మికులను కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు.