YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

యూపీలో మ‌రో నిర్భ‌య‌

యూపీలో మ‌రో నిర్భ‌య‌

ల‌క్నో, సెప్టెంబ‌ర్ 30, 
యూపీలో రెండు వారాల కింద యూపీలో ఓ యువతిని నాలుక కోసి అత్యాచారం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. మహిళలపై యూపీలో జరుగుతున్న అత్యాచారాలకు ఇదొక నిదర్శనం. పంట పొలాల చాటున ఓ యువతి నాలుక కోసి అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. హత్రస్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతి ఈ నెల 14న తన అమ్మ, సోదరుడితో కలిసి గడ్డి కోసం పంట పొలాల్లోకి వెళ్లారు. గడ్డి కోసుకుని ముందే సోదరుడు ఇంటికి వచ్చాడు. తల్లి, కూతురు పొలంలోనే ఉండిపోయారు. తల్లికి కొద్ది దూరంలో ఉన్న ఆ యువతిని నలుగురు దుండగులు సమీపంలో ఉన్న సజ్జ చేనులోకి లాక్కెల్లి.. అరవకుండా నాలుక కోసేశారు. పొలంలోనే ఉన్న తల్లి కూతురు కోసం వెతకగా పొలాల్లో కనిపించింది. అప్పటికే బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.  అక్కడ్నుంచి అలీఘర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవలే నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించారని, 14వ తేదీన ఫిర్యాదు చేస్తే నాలుగైదు రోజుల తర్వాత కేసు నమోదు చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితురాలు ఎస్సీ కులానికి చెందిన యువతి కాగా, నలుగురు దుండగులు అగ్రకులాలకు చెందిన వారు.

Related Posts