సికింద్రాబాద్ సెప్టెంబర్ 30,
దేశంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం అయన 157మంది లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అందచేసారు. మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. దళారులను ఆశ్రయించవద్దు. ప్రభుత్వ దవాకానాలలో వైద్యం ఉచితం. ప్రైవేట్ ఆసుపత్రిలకు వెళ్లి అప్పుల పాలు కావద్దని అన్నారు.