YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్రాన్ని ఎండగట్టాలి అపెక్స్ కౌన్సిల్ భేటీకి సీఎం వ్యూహం

కేంద్రాన్ని ఎండగట్టాలి అపెక్స్ కౌన్సిల్ భేటీకి సీఎం వ్యూహం

హైదరాబాద్ సెప్టెంబ‌ర్ 30,
వచ్చే నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంభంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి పంపాల్సిన అన్ని విషయాలకు సంభంధించి వివరాలను తీసుకుని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను సీఎం అదేశించారు.
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీ జలాల విషయంలో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటుంది. అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదలనకు ధీటైన సమాధానం చెప్పాలి. ఆదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియా పర్వాన్ని, ఏడు ఏళ్ల అలసత్వాన్ని ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలి. తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలి. నిజానిజాలను ఈ సమావేశం సందర్బంగా యావత్ దేశానికి తేటతెల్లం చేయాలి’ ముఖ్యమంత్రి అన్నారు.
‘రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పూడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి జరిగే నీటిని కేటాయించాలి. తెలంగాణ రాఊం 2014 జూన్ 2 న ఏర్పాడితే జూన్ 14 న ప్రధాన మంత్రికి లేఖ రాశాం. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపులు జరపాలని కోరాం. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్పూట్ యాక్ట్ 1956 సెక్షన్ ప్రకారం ప్రత్యేక ట్రిబ్యూనల్ వేసైనా, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యూనల్ ద్వారా రాష్ట్రాల మధ్యనైనా లేదంటే నదీపరివాహాల ప్రాంతాల్లోని మోత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరాం. ఏడేళ్ల సమయం వచ్చినా ప్రధానమంద్రికి రాసిన లేఖకు స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. పైగా అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్లు అనిపిస్తున్నారు. కానీ కేంద్రం ఏమీ చేయడంలేదు. 6 న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరినీ కుడా గట్టిగా ఎండగట్టాలి.  తెలంగాణ కు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలి.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

Related Posts