YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పథకాలు పూర్తి చేశాం మంత్రి బొత్స

పథకాలు పూర్తి చేశాం మంత్రి బొత్స

అమరావతి సెప్టెంబ‌ర్ 30, 
వైసీపీ మానిఫెస్టో లో పెట్టిన పథకాలు దాదాపు పూర్తి చేశాం. ఇప్పుడు అవి తమ పథకాలు అని టిడిపి నాయకులు సిగ్గు లేకుండా చెపుతున్నారు. బిసిల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలా చేస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అన్ని కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తాం అని జగన్ హామీ ఇచ్చారు. 139 కులాల్లో 56 కులాలకు కార్పొరేషన్లు అవసరం అని సీఎం కు గతంలో నివేదిక ఇచ్చాం. ఇంకొక వారం రోజుల్లో బిసి కార్పొరషన్ల ప్రకటన ఉంటుందని అన్నారు. అందులో సగ భాగం కార్పోరేషన్ ఛైర్ పర్సన్ లుగా మహిళలే ఉంటారు. కొన్ని మార్పులు చేర్పులు కోసం ప్రకటన వాయిదా వేశాం. తన పథకాలతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ ని మరిపించారు. చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని అయన అన్నారు. మహిళా సాధికారత కోసం జగన్ ప్రభుత్వం కృషి చేస్తుంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబుదని బొత్స అన్నారు.

Related Posts