YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

యూపీలో మరో ఘాతుకం..

యూపీలో మరో ఘాతుకం..

లక్నో అక్టోబర్ 1
యూపీలో మృగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. ఇప్పటికే హత్రాస్ లో ఓ దళిత యువతిని దారుణంగా హింసించి లైంగికదాడి చేసిన చంపేసిన ఘటన మరువకముందే దానిపై ఆందోళనలు కొనసాగుతుండగానే  మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఈ సారి బలరాంపూర్ జిల్లాలో మరో దళిత యువతి కామాంధుల దాష్టీకాలకు బలైపోయింది. కళాశాల ఫీజు కట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి.. వెన్నుపూస చేతులు కాళ్లు విరిగేలా కొట్టి.. తీవ్రంగా హింసించిన దుర్మార్గులు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.  వరుస ఘటనలపై దళితసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాలు నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
బలరాంపూర్ జిల్లాలోని ఓ  గ్రామానికి చెందిన యువతి(22) సమీపంలోని ఓ పట్టణంలో బీకాం సెకండియర్ చదువుతోంది. మంగళవారం కాలేజీ ఫీజు కట్టేందుకు వెళ్లింది. దీంతో మార్గమధ్యంలో కొంతమంది ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఓ రిక్షాలో ఆమెను ఇంటికి పంపించారు. అపస్మారక స్థితిలో ఉన్న కూతురును చూసి తల్లిదండ్రుల షాక్ అయ్యారు. అనంతరం ఆమెను  సమీపంలోని ఓ ఆస్పత్రికి  తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ కేసులో ఇప్పటికే బలరాంపూర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే బాధితురాలి కాళ్లు వెన్నెముక విరిచేసారనే ఆరోపణను పోలీసులు ఖండించారు. పోస్టు మార్టం రిపోర్ట్ లో అటువంటిది బయటపడలేదని తేల్చిచెప్పారు. మరోవైపు ఈ ఘటనపై దళితసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Related Posts